అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘AA23’పై రైటర్ రత్నకుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, మే రెండో వారం నుంచి పనులు మరింత ఊపందుకుంటాయని అన్నాడు. ఇది అంతర్జాతీయ స్థాయిలో మెప్పించే గొప్ప కథ అని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపాడు. బన్నీతో చర్చలు తమ టీంలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని చెప్పాడు.
అడివి శేష్, దర్శకుడు షానీల్ డియో కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా చిత్ర యూనిట్ టికెట్ ధరలను తగ్గించింది. ఏపీ సింగిల్ స్క్రీన్లలో రూ.105, 70గా.. తెలంగాణలో రూ.105, 80, 50గా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లలో టికెట్ ధర రూ.150 మాత్రమే. రేపటి నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.
జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెట్స్ నుంచి విదేశీ యాక్షన్ ఆర్టిస్ట్ శాంటో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అందులోని నటుల ఫిజిక్ చూస్తుంటే తారక్ కోసం నీల్ భారీ యాక్షన్ ఫీస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్లీక్ బాడీ, ఈ హై-వోల్టేజ్ విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మెగా హీరో సాయి దుర్గా తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని, ఇప్పుడు ‘సంబరాల యేటిగట్టు’లో నటిస్తున్నాడు. బైక్ ప్రమాదం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్తో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత సుజీత్, సందీప్ వంటి దర్శకులతో తేజ్ సినిమాలు చేయనున్నట్లు టాక్. మూడేళ్ల నిరీక్షణ తర్వాత తేజ్ వరుస సినిమాలతో రావడం ఫ్యాన్స్కు పండగే.
తమన్నా భాటియాతో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ‘జవాన్’ ఫేమ్ ఆలియా ఖురేషీతో కలిసి ముంబైలోని బాంద్రాలో కెమెరాలకు చిక్కాడు. వీరిద్దరూ ఒక జపనీస్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి బయటకు వస్తూ సందడి చేశారు. ఆలియాతో విజయ్ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఓటీటీ ప్రభావంతో థియేటర్లకు ఆడియెన్స్ రాక తగ్గడంపై చర్చ జరుగుతోంది. 8 వారాల గ్యాప్ ఉండాలని కొందరు కోరుతుంటే, తెలుగు, తమిళ నిర్మాతలు మాత్రం 4 వారాల గ్యాప్ చాలని స్పష్టం చేస్తున్నారు. దక్షిణాది నిర్మాతల్లో భిన్నాభిప్రాయాల వల్ల థియేటర్ల భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నా, ప్రస్తుతానికి అదే 4 వారాల ట్రెండ్ కొనసాగేలా కనిపిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ‘యానిమల్ పార్క్’లో రణ్బీర్ కపూర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. ఈ మూవీలో ఒక పవర్ఫుల్ కామియో కోసం ప్రభాస్ పేరు బలంగా వినిపిస్తోంది. కథలో కీలక ట్విస్ట్ సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే సినిమా స్థాయి మరో లెవల్కు వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మ్యూజిక్ టీంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలోకి స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ వచ్చినట్లు సమాచారం. క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదా డేట్స్ ఇష్యూ వల్ల హర్షవర్ధన్ తప్పుకున్నట్లు టాక్. తమన్ ఎంట్రీతో మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయట.
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 24-26 వరకు మెక్సికోలో జరిగే ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’లో ఈ సినిమా ఎక్స్క్లూజివ్ కంటెంట్, మేకింగ్ వీడియోలు ప్రదర్శించనున్నారు. ఎస్ఎస్ కార్తికేయ ఈ వేడుకకు హాజరుకానుండగా, రాజమౌళి వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పెయిడ్ ప్రివ్యూలతోనే రూ. 3.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 5 రోజుల్లో దేశీయంగా రూ. 72.75 కోట్ల నెట్ (రూ. 86.62 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఓవర్సీస్లో 3 మిలియన్ డాలర్ల మార్క్ను దాటడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 118 కోట్ల గ్రాస్ నమోదైంది. ఇదే జోరుతో త్వరలోనే రూ. 150 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.
రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో రానున్న ‘తలైవార్ 173’ డైరెక్టర్పై సస్పెన్స్ వీడింది. మొదట దర్శకుడు సిబి చక్రవర్తి ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ స్థానంలో అశ్వత్ మరిముత్తు పేరు వినిపించినా, చివరికి సిబి చెప్పిన కథకే రజినీ ఓకే చెప్పారట. ‘జైలర్ 2’ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇందులో రజినీ సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తారని టాక్.
ఉత్తరప్రదేశ్కు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి (29) గుండెపోటుతో కన్నుమూసింది. ఘజియాబాద్లో ఉంటూ హర్యానా, యూపీ మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. 50కి పైగా వీడియోలు, సినిమాల్లో నటించి హీరోయిన్గా ఎదగాలనుకున్న తరుణంలోనే ఈ విషాదం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె మృతితో అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’లో దీపికా పదుకొనె మార్పుపై వస్తున్న వార్తలకు చిత్రబృందం చెక్ పెట్టింది. ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా నుంచి తప్పుకుంటుందని లేదా ఆమె పాత్ర నిడివి తగ్గిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. దీపికా పాత్ర మూవీలో చాలా కీలకమని, షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతుందని వెల్లడిస్తూ రూమర్లను నమ్మొద్దని కోరింది.
‘స్టోరేజ్ వార్స్’ ఫేమ్, ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ డారెల్ షీట్స్ (67) కన్నుమూశారు. ఆరిజోనాలోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ప్రాథమిక విచారణలో అది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ‘గ్యాంబ్లర్’గా గుర్తింపు పొందిన ఆయన మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘మృత్యుంజయ’ వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోయినా, ఆయన క్రేజ్ తగ్గలేదు. తాజాగా ‘రంగబలి’ ఫేమ్ పవన్ బసమశెట్టి దర్శకత్వంలో శ్రీవిష్ణు ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రం, ‘సామజవరగమన’రేంజ్లో ప్రేక్షకులను అలరించనుందని సమాచారం.