‘పాపం ప్రతాప్’ ట్రైలర్ లాంచ్లో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ ఈవెంట్కు రావడానికి ప్రధాన కారణం తిరువీర్ అని, తన భార్యకు ఆయనంటే అభిమానమని వెల్లడించాడు. ‘మసూద’ మూవీ నుంచి ఆమె ఫ్యాన్ అయ్యారని తెలిపాడు. డైరెక్టర్ దుర్గ ప్రసాద్తో సినిమా చేసేందుకు తాను సిద్ధమని, ఏకంగా టవల్ వేసి కర్చీఫ్ వేస్తున్నానని చమత్కరించాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సిన స్పెషల్ సాంగ్ షూట్ వాయిదా పడినట్లు టాక్. అలాగే ఈ పాట ఎవరు చేయబోతున్నారనేది క్లారిటీ లేదు. దీంతో ఏప్రిల్ 30న మూవీ విడుదలవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాకే ఐటెం సాంగ్పై దృష్టి పెట్టనున్నారట.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘కొరియన్ కనకరాజు’. తాజాగా ఈ సినిమా షూటింగ్ నయా న్యూస్ వచ్చింది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్లో వరుణ్ తేజ్పై ఎంట్రీ సాంగ్ను షూట్ చేస్తారట. అంతేకాదు ఈ పాటలో వరుణ్తో రితికా నాయక్ కూడా కనిపిస్తోందని సమాచారం.
ప్రముఖ సింగర్ ఆశా భోస్లే ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 12 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 1943లో ప్రస్థానం మొదలుపెట్టి, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్ సంగీతంలో పాడిన మెలోడీలు, క్యాచీ సాంగ్స్తో రాణించారు. రెండు జాతీయ అవార్డులు, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులను అందుకున్న ఆమె.. భారతీయ సంగీత శిఖరంగా నిలిచారు.
సంగీత్ శోభన్ హీరోగా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ‘రాకాస’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై మానస శర్మ స్పందిస్తూ.. ‘రాకాస 2’ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. స్టోరీ స్ట్రక్చర్ సిద్ధంగా ఉందని, కానీ ఇంకా దాన్ని మరింత డెవలప్ చేయాలని తెలిపింది.
లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ముంబైలో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర సంగీతంలో అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. భోస్లే మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డెకాయిట్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్పై అప్డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం. వీరికున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 మార్చి 5న విడుదల కానుంది.
అక్కినేని నాగార్జున, దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కులుమనాలీలోని అందమైన లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. అక్కడ కీలకమైన యాక్షన్ సీక్వెన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నాగార్జునకు సంబంధించిన పోర్షన్ మొత్తాన్ని మే నెల నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్.
చియాన్ విక్రమ్ హీరోగా ప్రేమ్ కుమార్ సీ. దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ‘చియాన్ 64’ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా గోకులం స్టూడియోస్లో ఈ మూవీకి సంబంధించిన లుక్ షూట్ జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో అప్డేట్స్ రాబోతున్నట్లు టాక్.
లెజెండరీ గాయని ఆశా భోస్లే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె హెల్త్పై అప్డేట్ వచ్చింది. ‘తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. దయచేసి మా ప్రైవసీకి విలువ ఇవ్వండి. చికిత్స కొనసాగుతోంది. అంత త్వరగా సెట్ అవుతుంది’ అని ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో తెలిపింది.
బిగ్బాస్ ఫేమ్, యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్టాలో అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారని AISF నేతలు ఫిర్యాదు చేశారు. సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరమని, వెంటనే ఆమె అకౌంట్ను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబోలో మరో భారీ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ చెప్పిన చారిత్రక, ఎమోషనల్ కథ బాలయ్యకు బాగా నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఆయన మూవీ చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, RRR వంటి మూవీలకు కథలందించిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కథను అందించారట. ఇది ఒక భారీ బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామా లేదా హిస్టారికల్ మూవీ అయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయట.
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన ఒక కీలక ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రవితేజ, శోభన మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నట్లు టాక్. ఇక ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా, బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.