కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో నటి రుక్మిణి వసంత్ భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె ‘మెలిసా’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది.
ప్రభాస్ ‘రాజాసాబ్’లోని ‘నాచే నాచే’ పాట తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటను మెయిన్ స్టోరీలో కాకుండా.. కేవలం ఎండ్ క్రెడిట్స్లో మాత్రమే ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై దర్శకుడు మారుతి స్పందించాడు. ఈ పాటను ఎండ్ క్రెడిట్స్లో వాడటం లేదని, ఇది సినిమాలో భాగమేనని చెప్పాడు. ఇక ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది.
నేడు ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ 59వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది. కాగా, ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది.
యూత్ఫుల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘జిగ్రీస్’ మూవీ 2025 NOV 14న రిలీజై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వాకా, ధీరజ్ ఆత్రేయ కీలక పాత్రలు పోషించారు. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.
జానపద నృత్య కళాకారిణి వితాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు, మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగానే, చిరూ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
నటి రాశికి అనసూయ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది. ఇటీవల మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దానిపై స్పందిస్తూ రాశి ఓ వీడియో విడుదల చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో తనను కించపరిచేలా మాట్లాడారంటూ అనసూయ పేరు ఎత్తకుండానే ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ రాశికి క్షమాపణ చెప్పింది.
ఈ సంక్రాంతికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. పండగకు ముందుగానే కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, దళపతి విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానున్నాయి. శివకార్తికేయన్ ‘పరాశక్తి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్సిరీస్ సీజన్ 2 జనవరి 8 నుంచి స్ట...
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ ఈనెల 9న విడుదల కానుంది. తాజాగా మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో తనకు, ప్రభాస్కు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. తన సోలో సీన్ ఒకదాన్ని మూడు రోజులు పెద్ద స్విమ్మింగ్పూల్లో షూట్ చేశారని చెప్పింది. తనమీద మొసలి దాడి చేస్తున్నట్లు నటించాల్సిన సీన్ ఉందని చెప్పుకొచ్చింది.
యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పగానే.. సోషల్ మీడియాను తట్టుకోగలవా? అని అమ్మ అడిగింది. అన్నిటినీ ఎదుర్కోగలనని చెప్పా. నా మొదటి సినిమా విడుదలైనప్పుడు ట్రోల్ చేశారు. నా నటన గురించి కాకుండా లుక్స్ గురించి మాట్లాడారు. వాటని ఎదుర్కొనే ధైర్యం అమ్మే ఇచ్చింది. ఆ విషయంలో నా తల్లికి దండం పెట్టొచ్చు’ అని చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచి ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో భారత్లో నుంచే రూ.800 కోట్లు వచ్చాయి.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా నుంచి ఓ భారీ అప్డేట్ SMలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని 2027 ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈరోజు రా.9 గంటలకు పారిస్లోని ప్రఖ్యాత ‘లే గ్రాండ్ రెక్స్’ థియేటర్లో టీజర్ను విడుదల చేయనున్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల హీరో శర్వానంద్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనుండగా.. మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకుడు’ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథాంశం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ని పోలి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీని ఎఫెక్ట్తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ‘భగవంత్ కేసరి’ చిత్రం ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చి, టాప్ వ్యూస్తో దూసుకుప...
గతేడాది వరుస హిట్లు అందుకున్న రష్మిక.. ఇప్పుడు ‘కాక్టెయిల్ 2’తో సందడి చేయనుంది. షాహిద్ కపూర్, కృతి సనన్తో కలిసి ఆమె నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీకి హోమి అదజానియా దర్శకుడు. సెప్టెంబర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిట్ మూవీ ‘కాక్టెయిల్’కు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలో అధికారిక ప్రకటన రానుంది.