మూవీ థియేటర్ల భవిష్యత్తుపై దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘OTTల సబ్స్క్రిప్షన్ మోడల్ వల్ల మూవీలు నేరుగా స్ట్రీమింగ్కే పరిమితమై, థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు ఇదే బాట పడితే భారీ బడ్జెట్ మూవీల నిర్మాణం తగ్గిపోవచ్చు. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం థియేటర్ ఎక్స్పీరియెన్సే’ అని తెలిపారు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మున్నా’ మూవీ 2007లో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 2026 మార్చి 6న ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇలియానా నటించింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు. దీన్ని కేవలం డబ్బు కోసం తీసిన ‘చెత్త ప్రాపగండా’ చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ప్రజల మధ్య విభజన తెచ్చి లాభపడాలని చూస్తున్నారని మండిపడ్డాడు. ట్రైలర్లోని కొన్ని సీన్లపై స్పందిస్తూ.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, మేకర్స్ అత్యాశతోనే ఇలాంటి కథలు తీస్తున్నారని ఘాటుగా విమర్శించాడు.
కొచ్చిలో 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అమరన్’, ‘భ్రమయుగం’ మూవీలు సత్తా చాటాయి. ‘అమరన్’ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, ‘భ్రమయుగం’ రెండు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రాల్లో అద్భుత నటన కనబరిచిన హీరోలను ‘ఉత్తమ నటుడు’ అవార్డులు వరించాయి. దక్షిణాది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ...
బాలీవుడ్ నటి అయేషా ఖాన్ పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి పలువురిని సంప్రదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అయేషా.. ఆ ఫేక్ చాట్ స్క్రీన్షాట్లను, ఫోన్ నంబర్ను షేర్ చేస్తూ హెచ్చరించింది. ‘ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి’ అని స్పష్టం చేసింది. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపవద్దని ప్రజలను కోరింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ మార్చి 2న ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు రాజమౌళి బృందం హాజరయ్యే అవకాశం ఉంది.
విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన గతాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో ఆర్థిక కష్టాల వల్ల రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపాడు . ఆ సమయంలో రవి అనే వ్యక్తి తనను రక్షించి, కీబోర్డుతో పాటు రూ.35 వేలు ఇచ్చి ఆదుకున్నారని, అందుకే ఆయనపై కృతజ్ఞతతో తన పేరులో ‘రవి’ని చేర్చుకున్నానని వెల్లడించాడు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు త్వరలోనే 4K వెర్షన్లో రీ-రిలీజ్ కానున్నాయి. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పూరి ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ OTTలోనూ అదరగొడుతోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో FEB 28న సాయంత్రం 5:30కి టెలికాస్ట్ కానుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. జోర్డాన్లో మార్చి 6 వరకు జరగాల్సిన చిత్రీకరణ, స్థానిక జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ సమస్యల వల్ల ముందుగానే ముగిసిందట. దీంతో మిగిలిన చిన్నపాటి సీన్లను HYDలోని RFCలో వేసిన ప్రత్యేక సెట్స్లో పూర్తి చేయనున్నారట. FEB 25నే మేకర్స్ తిరిగి HYDకి రానున్నట్లు టాక్.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో విలక్షణ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీ ట్రైలర్ లాంచ్లో గోపీచంద్ మాట్లాడుతూ.. తన ప్రతి సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంటుందని, ఈ క్రేజీ ప్రాజెక్టులోనూ అది రిపీట్ కాబోతోందని హింట్ ఇచ్చాడు.
కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. ‘పుష్ప 2’ ప్రభంజనం సృష్టించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్) అవార్డులను గెలుచుకుంది. నివేదా థామస్ (35: చిన్నకథ కాదు) ఉత్తమ నటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఖాతాలో మొత్తం 7 అవార్డులు చేరాయి. దీనితో అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును బన్నీ సమం చేశాడు. యంగ్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా అల్లు అర్జున్ ఇప్పుడు టాప్లో నిలిచాడు.
నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషనే. నేను ఆరాధించే దర్శకులతో, విభిన్నమైన కథలతో మీ ముందుకు వస్తున్నాను’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ఏడాది అంతా కథల ఎంపికపైనే దృష్టి పెట్టానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. ఈ అప్డేట్తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.