• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

OFFICIAL: ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. 

April 11, 2026 / 11:24 AM IST

‘డెకాయిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ‘డెకాయిట్‌’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.15కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు పోస్టర్ షేర్ చేశారు. అటు ఓవర్సీస్‌లో కూడా 575K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక షానీల్‌ డియో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

April 11, 2026 / 11:10 AM IST

కొత్త ప్రాజెక్టు ప్రకటించిన అడివి శేష్

‘డెకాయిట్’ మూవీతో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న అడివి శేష్.. తాజాగా కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే శేష్ కోసం రాహుల్ అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘గూఢచారి 2’ మూవీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

April 11, 2026 / 11:03 AM IST

‘ఆదర్శ కుటుంబం’లో ‘ధురంధర్ 2’ నటుడు?

వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర కోసం ‘ధురంధర్ 2’ ఫేమ్ ఉదయ్ వీర్ సింధును మేకర్స్ ఎంపిక చేశారట. పలువురిని పరిశీలించిన తర్వాత, చివరకు మేకర్స్ ఉదయ్ వీర్‌నే ఫైనల్ చేసినట్లు సమాచారం.

April 11, 2026 / 10:56 AM IST

‘రేజర్’ విడుదల డేట్ ప్రకటించిన మేకర్స్

దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న విభిన్నమైన యాక్షన్ డ్రామా ‘రేజర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను ఆఖరి దశలో జరుపుకుంటోంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ఖరారు చేస్తూ, ఈ సమ్మర్ కానుకగా మే 8న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

April 11, 2026 / 10:18 AM IST

‘గోపీచంద్ 33’ టైటిల్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13 గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

April 11, 2026 / 10:06 AM IST

OTTలోకి ‘శబ్దం’ తెలుగు వెర్షన్

ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో కేవలం తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇక  అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 

April 11, 2026 / 09:37 AM IST

సినీ నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా

సినీ నిర్మాత సునీల్ నారంగ్‌కు ఆయన అకౌంటెంట్ భారీ టోకరా వేశాడు. బోగస్ ఖాతాల పేరుతో నిర్మాత వద్ద నుంచి ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

April 11, 2026 / 09:32 AM IST

కన్నడ ప్రజలకు బేషరతుగా రణ్‌వీర్‌ క్షమాపణలు

‘కాంతార’ భూత కోల వేషధారణపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వెనక్కి తగ్గాడు. కర్ణాటక హైకోర్టులో జరిగిన విచారణలో, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తానని హామీ ఇచ్చాడు. తన సింధీ నేపథ్యం వల్ల ఈ సంప్రదాయాల విశిష్టత తెలియక పొరపాటు జరిగిందని, ఇది ఉద్దేశపూర్వకం కాదని తెలిపాడు. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.

April 11, 2026 / 09:21 AM IST

ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘యూత్‌’.

కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూత్’ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముగ్గురు అమ్మాయిల కారణంగా టీనేజర్ ప్రవీణ్(కెన్‌ కరుణాస్‌) జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది ఈ సినిమా కథ.

April 11, 2026 / 09:15 AM IST

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

TG: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగ్లీ తనను రూ. 10 కోట్ల మేర మోసం చేసిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై BNS సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

April 11, 2026 / 09:04 AM IST

‘ప్రయోగాలు చేసేందుకు సిద్ధం’

తన కెరీర్‌లో ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ తమన్నా వెల్లడించింది. మహిళా ప్రాధాన్య చిత్రాలు, ఓటీటీ కంటెంట్, స్పెషల్ సాంగ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తాను నటించిన చిత్రాలన్నీ వరుసగా విడుదల కాబోతున్నాయని, ఈ కొత్త ప్రయాణం తనలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

April 11, 2026 / 08:27 AM IST

సౌత్ ఆడియన్స్‌పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

దక్షిణాది ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ పట్ల తమన్నా కృతజ్ఞతలు తెలిపింది. తనను వాళ్ల ఇంటి ఆడబిడ్డలా, కుటుంబ సభ్యురాలిలా ఆదరించడం తనలో ఎల్లప్పుడూ కొత్త ఊపిరిని నింపుతోందని చెప్పింది. అందుకే వారిని మెప్పించేందుకు కొత్త కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. సౌత్ ఇండస్ట్రీలో దక్కుతున్న గౌరవం తనను మరింత ఉత్సాహపరుస్తోందని మిల్కీ బ్యూటీ పేర్కొంది.

April 11, 2026 / 08:00 AM IST

లెబనాన్‌పై దాడులను ఖండించిన పోర్న్ స్టార్

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఖండించింది. తన మాతృభూమిపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరణించిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ.. వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. యుద్ధం పరిష్కారం కాదని, చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని పేర్కొంది.

April 11, 2026 / 07:55 AM IST

ఆవేదన వ్యక్తం చేసిన పోర్న్ స్టార్

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఖండించింది. తన మాతృభూమిపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరణించిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ.. వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. యుద్ధం పరిష్కారం కాదని, చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని పేర్కొంది.

April 11, 2026 / 07:55 AM IST