నటుడు రాజశేఖర్ తన లేటెస్ట్ మూవీ ‘బైకర్’ ప్రమోషన్స్లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు తన భార్య జీవిత, కూతుళ్లు శివాని, శివాత్మికలే ధైర్యం చెప్పారని తెలిపాడు. వారు ముగ్గురూ తనకు కోచ్లుగా మారి సలహాలిచ్చారని, వారి ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానని చెప్పాడు.
తమిళ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబోలో ‘AK64’ మూవీ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తన ప్యాషన్స్ అయిన సినిమా, రేసింగ్లను బ్యాలెన్స్ చేసేందుకు అజిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. నెలలో 15 రోజులు షూటింగ్కు, మిగిలిన 15 రోజులు రేసింగ్కు కేటాయించనున్నాడట.
చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం అందుకున్న మలయాళ మూవీ ‘వజా 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్, స్టార్లు లేకపోయినా కథతో మెప్పించవచ్చని ఈ సినిమా నిరూపించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నవీన్ ఎస్ఏ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ డ్రామా.. చదువు అబ్బని నలుగురు స్నేహితుల కథ చుట్టూ తిరుగుతుంది.
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ 2026 అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ‘తండేల్’ మూవీకి నాగచైతన్య ఉత్తమ నటుడిగా, ‘ది గర్ల్ఫ్రెండ్’కు రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా, అదే మూవీకి మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు. ‘మిరాయ్’ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఏప్రిల్ 16న ముంబైలో ఈ వే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘రాకా’. దాదాపు రూ.800-900 కోట్ల భారీ బడ్జెట్ రూపొందుతోన్న ఈ మూవీ కోసం బన్నీ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో 15% వాటాను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ రూ.100 కోట్లు డిమాండ్ చేయగా.. దీపికా పదుకొనె రూ.20-25 కోట్లు, రష్మిక మందన్న రూ.5-7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.
నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక యాక్షన్ ఫాంటసీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని 2026 మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మే 15 లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.
సినిమాలకు బ్రేక్ తీసుకోవడం వెనుక గల కారణాలను నటుడు విక్రాంత్ మాస్సే తాజాగా పంచుకున్నాడు. తన కుమారుడు వర్ధాన్ పుట్టిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాననే అపరాధభావం, పని ఒత్తిడి వల్ల కలిగిన మానసిక అలసట వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర కీలకమని, కుటుంబంతో గడపడానికే సినిమాలకు విరామం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.1700 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి HYDలోని ‘అల్లు సినిమాస్’లో ఈ సినిమాను వీక్షించాడు. ప్రేక్షకులతో కలిసి ప్రభాస్ థియేటర్లో సందడి చేయడంతో ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఒకే ఫ్రేమ్లో కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ఈ అరుదైన కలయిక జరిగింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో నాగ్ ముచ్చటిస్తుండగా, చిరు పక్కనే ఉండి ఆ క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘పేట్రియాట్’ ప్రమోషన్స్లో నటుడు మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఒత్తిడిని తట్టుకోవాలన్నాడు. ప్రతి నటుడు తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకుంటారని, తాను కూడా నటిస్తూనే మరణించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. నీరసంగా ఉన్నా సరే, మంచి పాత్ర వస్తే నటుడు వంద శాతం కష్టపడి నటిస్తాడని ఆయన పేర్కొన్నాడు
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం, 2026, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వశిష్ఠ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ మేనియా ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఉంది. 2026 డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా ‘ఐమ్యాక్స్ 70mm’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మూవీ క్రేజ్ ఎంతలా ఉందంటే, రీసేల్ మార్కెట్లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.90,000 వరకు పలుకుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇంత భారీ మొత్తం వెచ్చించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు ‘వారణాసి’ మూవీపై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో మహేష్ శివభక్తుడిగా, టైం ట్రావెలర్గా కనిపిస్తారట. కనుమరుగైన ఒక విశ్వ కళాఖండం కోసం ఆయన చేసే పోరాటమే ఈ మూవీ కథ అని టాక్. విలన్ కుట్రలను ఛేదిస్తూ, కాల గమనాన్ని దాటి మహేష్ ప్రపంచాన్ని ఎలా కాపాడారనేది ఆసక్తికరంగా ఉంటుందట. ప్రాచీన రహస్యాలు, అడ్వెంచర్ కలయికతో ఈ మూవీ గ్లోబల్ రేంజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ‘రాకా’ మూవీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో NTR ‘శక్తి’ మూవీలో విలన్ పేరు రాకా కావడంతో, నెటిజన్లు ఆ డిజాస్టర్ను గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే, కేవలం పేరు కలిసినంత మాత్రాన పాత ఫ్లాపులతో ముడిపెట్టడం సరికాదని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్స్టాలో ‘రాకా’ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘పరిధులకు అతీతమైన దృశ్యం కోసం సిద్ధంకండి’ అంటూ పేర్కొంది. దీంతో ఆమె ఈ సినిమాలో నటించడం ఫిక్స్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.