రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ చిత్రీకరణపై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం కేరళ అడవుల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఆధ్వర్యంలో 15 రోజుల పాటు భారీ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో హైలెట్గా నిలవనున్నాయి.
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ‘రాకాస’ మూవీ మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 2026 మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.27 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
నటసింహం బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘NBK 111’ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ అదుపులో ఉంచేందుకు తన పారితోషికాన్ని రూ.40 కోట్ల నుంచి రూ.30 కోట్లకు తగ్గించుకున్నారట. హీరోయిన్ విషయంలోనూ పొదుపు పాటిస్తూ, రూ.8.5 కోట్ల నయనతార స్థానంలో రూ.1.5 కోట్లతో కాజల్ను ఎంపిక చేశారట. నిర్మాతలకు భారం కాకూడదనే బాలయ్య ఈ స్టెప్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.
జూ. ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పీటర్ హెయిన్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో 1 నేనొక్కడినే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత క్వాలిటీతో 4కే వెర్షన్తో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇప్పటికే మహేష్ మూవీ మురారి రీ-రిలీజ్ అయి భారీ వసూళ్లను సాధించింది.
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అషురెడ్డి, ఆమె ఫ్యామిలీ రూ.9.35 కోట్లు కాజేశారని షేక్పేట్కు చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని వాపోయారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా టాక్సిక్ తెరకెక్కుతుంది. అయితే దర్శకురాలి పనితీరుపై యష్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘సున్నితమైన భావాలను గీతూ ఎంత బాగా చూపించారో, యాక్షన్ సీన్స్ను కూడా అంతే పవర్ఫుల్గా తెరకెక్కించారు. ఒక లేడీ డైరెక్టర్ ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలరా? అని ఆమెతో కలిసి ప్రయాణించాకే నాకు అర్థమైంది’ అని చెప్పకొచ్చారు.
మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సుహాస్, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న మూవీ మండాడి. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘అలెల్లె అలెల్లె’ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతుండగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
జేడీ చక్రవర్తి ఇటీవల ‘శివ’ సినిమా జ్ఞాపకాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘షూటింగ్ మొదటి రోజే వర్మ తన ముక్కుసూటితనంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజు మాస్టర్ డిజైన్ చేసిన భారీ యాక్షన్ ఎఫెక్ట్స్ వర్మకు నచ్చకపోవడంతో వద్దని చెప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు నాగార్జున వర్మను నమ్మి సపోర్ట్ చేయకపోతే, ఆయన కెరీర్ అక్కడే ముగిసిపోయేది’ అని తెలిపాడు.
మెక్సికోలో జరుగుతున్న 41వ గ్వాడలజరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అస్సాం మూవీ ‘ఏ టీచర్స్ గిఫ్ట్’ విశేష ఆదరణ పొందుతోంది. రాజ్దీప్ స్వయంగా నటించి, కథ అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రదర్శితమైంది. ప్రతిష్టాత్మక ‘ప్రెమియో మాగీ’ విభాగంలో పోటీ పడుతూ, బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 పరిశీలనలోనూ నిలిచి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.
హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘సన్నీ సంజయ్’ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు భాను భోగవరపు, పవన్ బసంశెట్టిలతో కూడా కొత్త ప్రాజెక్టుల చర్చలు జరుపుతున్నాడు.
టాలీవుడ్ డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, చందూ మొండేటి బాలీవుడ్ వైపు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా తాజాగా పట్టాలెక్కింది. ఇందులో నయనతార హీరోయిన్. మరోవైపు చందూ మొండేటి, అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కాంబోలో ఉజ్జయినీ బ్యాక్ డ్రాప్లో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనిని కరణ్ జోహార్ నిర్మించే అవకాశం ఉంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల యువ నటుడు అబిసన్పై చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తన కొత్త సినిమా ‘పేట్రియాట్’ ప్రమోషన్లలో మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘యూత్’ సినిమా సక్సెస్ మీట్లో అబిసన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ తనను బాగా కదిలించిందని పేర్కొన్నాడు. సినిమాపై ఆ యువ నటుడికి ఉన్న అంకితభావం, ప్యాషన్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని కొనియాడాడు.