ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త లోగో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘పాపం ప్రతాప్’ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంది.