రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్రావు: కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.