విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ ప్రాణస్నేహితుల పెళ్లిలో వీరిద్దరూ సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పంచుకున్న వివాహ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహితుల బంధం, వేడుకలోని వీరి ఉత్సాహం అభిమానులను ఆకట్టుకుంటోంది.