• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

ATP: తాడిపత్రి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఒక గుజరీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

April 29, 2026 / 04:20 PM IST

కరెంట్ షాక్‌తో వలస కూలీ మృతి

NLR: ఆత్మకూరులో విషాద ఘటన జరిగింది. అల్లూరి జిల్లాకు చెందిన రాంప్రసాద్ (20) ఆత్మకూరుకు వలస వచ్చాడు. వింజమూరు మండలం నల్లగొండ్లలో కరెంట్ పనుల కోసం బుధవారం వెళ్లాడు. ఈక్రమంలో యువకుడికి విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. పనికి పిలిపించిన కాంట్రాక్టర్ తమను పట్టించుకోలేదని రాంప్రసాద్ వెంట వచ్చిన యువకులు వాపోయారు.

April 29, 2026 / 04:10 PM IST

సాఫ్ట్‌వేర్ సీతారాం సూసైడ్ కేసులో కీలక పరిణామం

సాఫ్ట్‌వేర్ సీతారాం సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య రేణుక, ఆమె ప్రియుడు రమణతో పాటు శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు. భార్య రేణుక ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఫిబ్రవరిలో సీతారాం.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

April 29, 2026 / 04:02 PM IST

జంట హత్యల కలకలం

AP: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. చినరాజపురంలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. సవర ఇల్లంగో(55), భార్య జ్యోతి(45)ని గొడ్డలితో నరికి కోటయ్య అనే వ్యక్తి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 08:10 AM IST

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం

AP: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వివాహితపై అత్యాచారం జరిగింది. ఈనెల 26న విశాఖ నుంచి నడికుడికి భర్తతో కలిసి మహిళ ప్రయాణం చేసింది. ఈ క్రమంలో జనరల్ బోగీలోని దంపతులను AC బోగీలో ఖాళీ ఉందని చెప్పి నిందితుడు తీసుకెళ్లాడు. భర్త టాయిలెట్స్ వద్ద కూర్చోగా.. భార్యను AC కూపేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2026 / 07:56 AM IST

గుత్తి మండలంలో విషాదం

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో భోయగడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 28, 2026 / 06:20 PM IST

కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: ముమ్మిడివరానికి చెందిన రాజులపూడి అనిల్ మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తుండగా వై జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని కారు అనిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

April 28, 2026 / 06:00 PM IST

ఇద్దరు పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య

TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులకు ఉరి వేసి తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మార్కెట్ ఎదురుగా పొలంలో షావలి అనే వ్యక్తి ఉరి వేసుకున్నాడు. పెద్ద కుమారుడు విలాస్ 5 ఏళ్లు, చిన్న కుమారుడు వికేష్‌కు 3 ఏళ్లు ఉంటాయి. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

April 28, 2026 / 11:39 AM IST

ప్రైవేట్ బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి గాయాలయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పోలవరం మండలం పాలరేవుకు చెందిన గణేష్‌గా గుర్తించారు.

April 28, 2026 / 07:55 AM IST

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

AP: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూసపాటిరేగ జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 28, 2026 / 04:05 AM IST

పట్టాలు తప్పిన వందేభారత్ రైలు

మహారాష్ట్రలో వందేభారత్ రైలు పట్టాలు తప్పింది. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న ట్రైన్ పూణె స్టేషన్ సమీపిస్తుండగా రైలు పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా పూణే మార్గంలో వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రైస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వందే భారత్ రైలు పట్టాలు తప్పడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

April 27, 2026 / 11:15 PM IST

కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో జుబా నగారనికి సమీపంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు 13 మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ఇద్దరిని కెన్యా జాతీయులుగా, మిగిలిన వారిని దక్షిణ సూడాన్ వాసులుగా గుర్తించారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

April 27, 2026 / 10:30 PM IST

BREAKING: క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి

TG: హైదరాబాద్‌లోని శంకరపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఈదురు గాలుల ధాటికి NCC కన్స్ట్రక్షన్‌కు చెందిన ఒక భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

April 27, 2026 / 06:17 PM IST

బహ్రెయిన్‌లో ఏపీ యువతి ఆత్మహత్య

AP: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ప.గో.జిల్లా చిట్టవరానికి చెందిన వర్ధనపు కవిత(23) ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే వెళ్లిన ఆమె, పని చేసే ఇంట్లోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కవిత మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ కేంద్రమంత్రి శ్రీనివాసవర్మకు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 10:13 AM IST

నాన్‌వెజ్ ఎందుకు వండలేదన్న భర్త.. చంపేసిన భార్య

TG: నాన్‌వెజ్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ భర్తను భార్య హత్య చేసేవరకు వెళ్లింది. కామారెడ్డికి చెందిన శివాజీ(31) శనివారం రాత్రి నాన్‌వెజ్ ఎందుకు వండలేదని భార్య లక్ష్మీపై కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆగ్రహంతో లక్ష్మీ ఇంట్లో ఉన్న కొడవలితో శివాజీ మెడపై వేటు వేసింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

April 27, 2026 / 09:42 AM IST