AP: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. చినరాజపురంలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. సవర ఇల్లంగో(55), భార్య జ్యోతి(45)ని గొడ్డలితో నరికి కోటయ్య అనే వ్యక్తి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.