AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో ముగ్గురు బాధితులు 90 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం అర్ధరాత్రి కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
E.G: రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్య కుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్యులు వేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితిలో మార్పు రాలేదు.
కాంగోలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రుబయా కోల్టన్ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మందికిపైగా మృతిచెందారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ఈ గని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని రెబల్ గ్రూప్ పేర్కొంది.
NLR: మనుబోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ ఎదురుగా హైవేపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరుకు చెందిన పెంచలయ్య పల్లవ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. పని మీద సొంత ఊరు నుంచి మనుబోలుకు రాంగ్ రూట్లో బైకుపై వస్తుండగా అదే సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల ఆటో ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి అబ్బిరెడ్డి వారి వీధి లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పాక పూర్తిగా దగ్ధమైంది. గుబ్బల సత్యవతి అనే మహిళ నిర్వహిస్తున్న తాటాకు పాక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్దం అయినట్లు స్థానికులు అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను(33) మృతి చెందాడు. ఇవాళ ఒక్కరోజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
AP: చిత్తూరు జిల్లా తుమ్మెదపాలెంటో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. సాయికుమార్ అనే వ్యక్తిపై ఢిల్లీ అనే యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు సాయికుమార్ మృతి చెందాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీరశ్రీనివాస్(48) మృతి చెందాడు. మృతుడు సామర్లకోట కుమ్మరివీధికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.
KKD: తాళ్లరేవు మండలం సీతారామపురం గుడ్డివానితూము కూడలిలోని ఒక భవనంపై బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఎర్రని బనియన్ ధరించి, చేతికి కడియం కలిగి ఉన్నాడు. వారం రోజుల కిందటే మృతి చెంది ఉంటాడని కోరింగ పోలీసులు భావిస్తున్నారు.
NLR: కందుకూరు శివారులో కొండముడుసుపాలెం జంక్షన్ సమీపంలో బుధవారం హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి పామూరు వెళ్తున్న కారు నిలిపి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టడంతో చాంద్ బాషా మృతి చెందాడు. ఈయనది పామూరు సమీప గ్రామమని సమాచారం. గాయపడ్డ ఆదిశేషారెడ్డిని ఒంగోలు RIMSకు తరలించారు.
AP: చోరీకి వచ్చి దొంగ మృతిచెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి వచ్చారు. వారిని కాలనీవాసులు వెంటాడటంతో పరిగెత్తుతూ ఓ దొంగ రైల్వే ట్రాక్పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడి మృతిచెందాడు. పరారైన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మేకను దొంగిలించారన్న ఆరోపణలతో ఇద్దరు విద్యార్థులను తాడుతో కట్టేసి కొట్టడంతో ఒకరు మృతిచెందారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. సంబిత్, మరో బాలుడు కలిసి మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇందకోలి గ్రామంలో వారిద్దరినీ తాడుతో కట్టేసి కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సంబిత్ మృతిచెందాడు.
AP: నకిలీ నోట్ల చలామణి కేసులో ఏడుగురు నిందితులకు విశాఖలోని NIA ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులు అసోం, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 2015లో వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి చలామణి చేసినట్టు NIA నిర్ధారించింది.
దక్షిణ ఇరాన్లోని మినాబ్ పట్టణంలో ఫిబ్రవరి 28న జరిగిన ఘోర వైమానిక దాడిలో ఓ ప్రాథమిక పాఠశాల నేలమట్టమైంది. ఈ ఘటనలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోగా, మరో 96 మంది గాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా ఈ దాడి చేశాయని ఇరాన్ ఆరోపిస్తుండగా, వైరల్ అవుతున్న విద్యార్థినుల చివరి ప్రార్థన వీడియో ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది.