NLR: ఆత్మకూరులో విషాద ఘటన జరిగింది. అల్లూరి జిల్లాకు చెందిన రాంప్రసాద్ (20) ఆత్మకూరుకు వలస వచ్చాడు. వింజమూరు మండలం నల్లగొండ్లలో కరెంట్ పనుల కోసం బుధవారం వెళ్లాడు. ఈక్రమంలో యువకుడికి విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. పనికి పిలిపించిన కాంట్రాక్టర్ తమను పట్టించుకోలేదని రాంప్రసాద్ వెంట వచ్చిన యువకులు వాపోయారు.