TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు సీఎం రేవంత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు.