NLR: కావలి రూరల్ వెంకయ్య గారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. లారీ పూర్తిగా ద్వంసం అయ్యింది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు.