TG: సూర్యపేట జిల్లా కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.