TG: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు నాలుగేళ్ల కుమారుడు మృతి చెందాడు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.