• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమరావతి ఓఆర్‌ఆర్ పనులు వేగవంతం

GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. 189.9 కి.మీ మేర నిర్మించే ఈ రోడ్డు డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం జిల్లా వారీగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కేంద్రానికి అప్పగించారు. మిగిలిన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయనున్నారు. ప్రాథమిక సర్వేలు కొనసాగుతున్నాయి.

February 21, 2026 / 09:46 AM IST

అన్నమయ్య: బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

అన్నమయ్య: పీలేరు పట్టణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

February 21, 2026 / 09:45 AM IST

ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాలపై అవగాహన

W.G: మొగల్తూరు ఆనంద్ రొయ్యల ఫ్యాక్టరీలో శనివారం కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ కార్మికులకు ఫైర్ సేఫ్టీపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.

February 21, 2026 / 09:45 AM IST

బైకును ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలు

E.G: నల్లజర్ల మండలo పుల్లలపాడు ఎకో హోటల్ వద్ద బీట్ కానిస్టేబుల్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవికు తీవ్ర గాయాలు కాగా పోలీసులు అతన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:44 AM IST

రాయదుర్గంలో వివాహిత ఆత్మహత్య

ATP: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగాధర్ భార్య 50ఏళ్ల మద్దానమ్మ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద బైలాటం ఆడుతుండగా భార్య ఉరివేసుకుందన్న సమాచారంతో హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 21, 2026 / 09:43 AM IST

అదనపు కట్నం కోసం వేధించిన వ్యక్తికి రెండేళ్లు జైళ్లు శిక్ష

VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్రాంతానికి చెందిన గౌరి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021లో ఆమెపై దాడి చేశాడు.

February 21, 2026 / 09:40 AM IST

కోదండరామయ్యకు స్నపన తిరుమంజన సేవ

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్‌కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ఆలంకరించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

February 21, 2026 / 09:40 AM IST

‘ప్రభుత్వం ఆదాని సంస్థకు వేలకోట్లను దోచిపెడుతుంది’

కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమర్చి, ఆదాని సంస్థకు వేలకోట్లు సొమ్మును దోచిపెడుతుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల యూనిట్ కి ఉదయం ఒక రేటు, సాయంత్రానికి రేటు నిర్ణయిస్తారని దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

February 21, 2026 / 09:38 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి

PLD: శావల్యాపురం మండలం వేల్పూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యద్దనపూడి రామకోటయ్య (77) బహిర్భూమికి వెళ్లిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు ఆయనను బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:37 AM IST

మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

PPM: జియ్యమ్మవలస మండలం పెదమేరంగి, సుభద్రవలన ప్రాంతాల పరిసరాల్లో ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇవాళ వెల్లడించారు. సమీపంలోని పామాయిల్ తోటల్లో ఏనుగులు తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగుల కదలికలను గమనించాలని సూచించారు. ఏనుగులు ఎదురైతే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

February 21, 2026 / 09:35 AM IST

‘ఈనెల 23 నుంచి దరఖాస్తులు చేసుకోండి’

TPT: వెంకటగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆహ్వానించారు. ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనుండగా, మెరిట్ జాబితాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 09:34 AM IST

‘శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు’

KKDP: గండేపల్లి మండలంలో ఆకతాయిగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న 11 మంది వ్యక్తులకు జగ్గంపేట CI శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గండేపల్లి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లో హాజరపరచి, సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేశామని సీఐ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా CI హెచ్చరించారు.

February 21, 2026 / 09:34 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 39,838 మంది

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 21, 2026 / 09:32 AM IST

మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ.. ఐద్వా నిరసన

అన్నమయ్య: మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ శుక్రవారం మదనపల్లిలోని స్థానిక విజయనగర్ కాలనీలో ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, వారికి సామాజిక మద్దతు అందించాల్సిన అవసరాన్ని నిరసనకారులు నొక్కి చెప్పారు.

February 21, 2026 / 09:31 AM IST

రేపు కేంద్ర మంత్రి మంత్రాలయం రాక

KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీలు శాఖ మంత్రి హెచ్ ఢీ కుమారస్వామి రేపు మంత్రాలయం రానున్నారు. ఆయన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 23వ తేదీన గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటునట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

February 21, 2026 / 09:31 AM IST