NDL: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వెలుగోడు మండలం వేల్పనూరులో వివిధ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 48 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు.