KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా పాత పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు