KRNL: పార్టీకి బలం, బలగం సోషల్ మీడియా సైనికులేనని ఎమ్మెల్యే విరుపాక్షి, తనయుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇవాళ చిప్పగిరిలో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం సోషల్ మీడియా సైనికుల బాధ్యత అని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.