NZB: ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుణోదయ మహాసభలను ఏప్రిల్ 10,11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.