మండే ఎండల వేళ ‘చల్లని బీరు’ దాహాన్ని తీరుస్తుందని చాలామంది భావిస్తారు. కానీ బీరు తాగినప్పుడు తాత్కాలికంగా హాయిగా అనిపించినా.. బీరులోని ఆల్కహాల్ శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్కు గురిచేస్తుంది. దీనివల్ల శరీరం మరింత వేడెక్కి నీరసించిపోయి మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, ఎండదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే బీరు కంటే కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగడం మంచిది.