SKLM: ఆమదాలవలస(మం) నెల్లిపర్తిలో సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. డా.బొడ్డేపల్లి సురేష్ పర్యవేక్షణలో సుమారు 250 మందికి బీపీ, షుగర్, కీళ్ల వాతం, థైరాయిడ్, గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ జ్వరాలు, వడదెబ్బ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.