సత్యసాయి: లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ అర్చకుడు ఎంవి శ్రీనివాస్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ తరపున ఈవో ఎంహెచ్ నరసింహమూర్తి, కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంఎటీఎస్ రాము, టూరిజం గైడ్స్, ఆలయ సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, అధికారులు పాల్గొన్నారు.