NLG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తారని అనడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న మధ్యాహ్న భోజనంపై ఇలా మాట్లాడడం దుర్మార్గమన్నారు.