W.G: రైతు ఆదాయాన్ని పెంచి, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ సంకల్పమని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఆదివారం నరసాపురం మండలం మోడీ గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి అన్నదాత సుఖీభవ పథకంపై ప్రచారం నిర్వహించారు.