CTR: సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె ఎంపీపీ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో నిర్వాహకులు 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.