కర్నూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ నాగరాజు ఆదివారం తెలిపారు. సంజయ్ గాంధీ నగర్లో దివ్యాంగ ఉద్యోగుల సంఘం, యువసేన కార్యాలయాలను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం, భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్య సహాయం, స్వయం ఉపాధికి సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక కోటపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.