NTR: నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు నిర్ధారణ ఎంతో ముఖ్యమని, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు.