శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా వాళ్ళు లేరని, ఏ ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చరాదని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియా కులస్థులను ఎస్టీలుగా గుర్తించాలని, ఇటీవల అసెంబ్లీలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.