GNTR: తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు రౌడీషీటర్లు, పాత నేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణ ప్రశాంతతకు భంగం కలిగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, రౌడీషీటర్లపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.