ASR: జీకేవీధి(మం) జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. పెదవలస నుంచి రింతాడ వస్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. రహదారి కింద వైపు ఉన్న ఇళ్లవైపు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.