VZM: పెదబంటుపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ 10వ తరగతి విద్యార్థుల గృహాలకు వెళ్లి పరామర్శించారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రస్తుత చదువు స్థాయిని పరిశీలించి, వారికి అవసరమైన సలహాలు, దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతోనూ చర్చించి, పిల్లలు నిరంతరంగా చదువుకునేలా అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ఏలూరు: నగరంలోని డివిజన్ 27, 28లలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గోడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల వద్ద ఉన్న ఈ- వేస్ట్ ను అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
గుంటూరు: మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. గుంటూరు జోన్-3 పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ లింక్ ద్వారా వీటిని సరిచేయాలి. యూడైస్ కోడ్ ఆధారంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మతం తదితర వివరాలను శనివారం సాయంత్రం 5 గంటల్లోపు సవరించాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో శనగలు, మినుముల కొనుగోలుకు మార్క్ఫెడ్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని జాయింట్ కలెక్టర్ నిర్మల కుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనగలకు క్వింటాలుకు రూ. 5875, మినుములకు రూ.7800 మద్దతు ధర నిర్ణయించిందని ఆమె వెల్లడించారు. రైతులు ఈనెల 21వ తేదీ నుంచి రైతుసేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆమె సూచించారు.
BPT: బాపట్ల జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 19,032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 9,744 మంది, రెండో సంవత్సరం నుండి 9,288 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వేనంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వే నంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
CTR: జీడీనెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల సమీక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు తహశీల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. బుధవారం జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది.
KRNL: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనన.. మరణా లను 21 రోజుల్లో నమోదు చేసుకోవాలని DMHO డాక్టర్ భాస్కర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనన, మరణాలను 21 రోజు ల్లోపు చేసుకొంటే సేవలు ఉచితంగా, 21 నుంచి 30 రోజుల్లో చేసుకొంటే రూ.25, నెల దాటితే రూ.250, ఏడాది అయితే రూ.500 రుసుముతో పాటు అఫిడవిట్ అధికారి అనుమతి అవసరమని ఆయన చెప్పారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గోవిందవాడ, తారకాపురం మిర్చి రైతులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇటీవల మిర్చి పొలాలలో జరుగుతున్న దొంగతనాలపై రైతన్నలకు తగు సూచనలు అందజేశారు. రాత్రి వేళల్లో ఎక్కువ సమయాల్లో రైతన్నలు తిరుగుతూ దొంగతనాలను నివారించుకోవాలని సూచించారు. తమ పోలీసు సిబ్బందిని సైతం నైట్ బీట్ నిర్వహించేలా చూస్తామని వారికి తెలిపారు.
ATP: తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత 11 రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఏకాంతోత్సవం జరిపారు. ముగింపు వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
NLR: విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో ఆమె మామ ఇంటికి రావడంతో గోడ దూకి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
W.G: తణుకులోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మండల, పట్టణ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.
సత్యసాయి: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర బహిర్గతమైందని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థకు అనుబంధమని ఇన్నాళ్లు ప్రచారం చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కల్తీ అంశం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.