సత్యసాయి: అమరాపురం మండలంలోని వారపుసంత, బస్టాండ్, దినసరి సంతలకు ఈనెల 25న వేలంపాట నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగానంద్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దినసరి సంతకు రూ. 20 వేలు, వారపు సంతకు రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.