• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ అవగాహన

కడప: నగరంలోని చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో ‘శక్తి’ టీమ్ ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ వినియోగం, ఎస్‌.ఓ.ఎస్ బటన్ ప్రాముఖ్యత, డయల్ 112 సేవలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తు చేశారు.

February 21, 2026 / 10:22 AM IST

ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శానిటరీ సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను శనివారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.

February 21, 2026 / 10:21 AM IST

‘మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి’

ELR: వట్లూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం -1లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

February 21, 2026 / 10:20 AM IST

దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: షర్మిల

అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఖండించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఇక్కడ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 10:12 AM IST

ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్..!

W.G: ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెడుతున్నారు.

February 21, 2026 / 10:11 AM IST

గంజాయి కేసు.. విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన.!

VZM: బొబ్బిలి (M) కోమటిపల్లిలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న కేసులో 11మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ బాలుడు, 7గురు విద్యార్థులు ఉండటం కలకలం రేపింది. కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలు విక్రయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 10:11 AM IST

విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి

అన్నమయ్య: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ పాల్గొన్నారు. జనగణన ఏర్పాట్లపై కేంద్ర అధికారులు మార్గదర్శకాలు అందించగా, జిల్లా స్థాయిలో ముందస్తు సిద్ధతపై కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 10:11 AM IST

తండ్రిపై దాడి చేసి బంగారంతో పరార్

KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్‌తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 21, 2026 / 10:09 AM IST

దేవరపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం

E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST

వైసీపీ సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శిగా శ్యామ్ సుందర్

ATP: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా పుట్లూరు మండలానికి చెందిన యువనేత శ్యామ్ సుందర్ రెడ్డి బెడదల నియమితులయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నేతలకు శ్యామ్ సుందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 10:06 AM IST

ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..?

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

February 21, 2026 / 10:04 AM IST

విద్యార్థులకు ఏయూ రిజిస్ట్రార్ సూచనలు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉంటూ, తమ సమయాన్ని కెరియర్ నిర్మాణంపైనే పెట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలోని గ్రంథాలయాలు, వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

February 21, 2026 / 10:00 AM IST

‘చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలి’

NLR: బుచ్చి పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ లిట్టెర్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొని జొన్నవాడ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు చెత్తను పారిశుద్ధ కార్మికులకు అందజేయాలన్నారు.

February 21, 2026 / 09:55 AM IST

పక్కాగా చెత్త సేకరణ కార్యక్రమం

అల్లూర:  కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలుచేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్‌కు స్పందించాలన్నారు. సోమవారం శింగరాళ్లపాడు, మంగళవారం లుబ్బర్తి, బుధవారం గింజర్తి, గురువారం చింతలపూడి, శుక్రవారం రోడ్డు చింతలపూడి, శనివారం లొద్దిపాకలు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు.

February 21, 2026 / 09:50 AM IST

95 మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు విడుదల

SKLM: ఏపీ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు ఎక్స్‌ గ్రేషియా శనివారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాగా, మిగిలిన 5 మంది ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని మంత్రి తెలిపారు.

February 21, 2026 / 09:47 AM IST