ATP: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు పట్టణ ప్రజలకు హెచ్చరించారు. ఆదివారం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటిస్తూ… ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.