CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చిత్తూరుకు చెందిన దాత కస్తూరి రంగన్ రోహిణి రంగన్ దంపతులు రూ.5 లక్షలు విలువైన వెండి వస్తువులు వితరణ చేశారు. ఆలయానికి చేసిన వీరికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అర్చకులు శేషాద్రి ఆచార్యులు, సర్పంచ్ మధు, భక్తులు పాల్గొన్నారు.