W.G: పన్నెండేళ్లకు ఒకసారి జరిగే తాడేపల్లిగూడెం పట్టణ పుర దేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మాగంటి కళ్యాణమండపంలో టీడీపీ ఇంఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో హాజరయ్యారు.