KRNL: హాలహర్వి మండలం సిరుగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి వనప్ప అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.