WNP: ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మదనాపురం మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు.