AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. గత రెండేళ్లలో రూ.24 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలతో కలిపి 341 పనులు పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా VMRDA ద్వారా మరో రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 28 వార్డుల్లో 81 పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు.