E.G: PGRS, రెవెన్యూ క్లినిక్ అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించాలని RDO ఆర్. కృష్ణ నాయక్ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అందిన ప్రతి ఫిర్యాదును నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
GNTR: వీధి కుక్కల నియంత్రణకు గాను ఏర్పాటు చేస్తున్న యాంటీ బర్త్ కంట్రోల్ (ABC), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ సెంటర్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం పొన్నూరు రోడ్డులోని ఏబీసీ సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ ప్లాంట్ను ఆయన స్వయంగా పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రకాశం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.
SKLM: ఇచ్చాపురం ఎంఈవో అప్పారావు ఏసీబీ వలలో చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి రూ.30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందస్తు సమాచారంతో రూ.10,000 లంచం స్వీకరిస్తుండగా ఎంఈవోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కోనసీమ: కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేయాలని సూచించారు
ATP: జిల్లాలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపం మాపాలని, ఎక్కడైనా ఇలాంటి కేసులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్ను ఆవిష్కరించారు. అనంతరం వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై సామర్థ్యత పెంపుదలపై సదస్సు నిర్వహించారు.
అనంతపురం: రాజమండ్రిలో కల్తీ పాలఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, దోషులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాకి ఆయన ప్రకటన విడుదల చేశాడు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
SKLM: ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల విధులు, సేవలు అత్యంత అవసరమని అదనపు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ కెవి రమణ అన్నారు. సోమవారం ఎచ్చర్ల పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల 14 రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ శాఖ ఆవశ్యకతను ఆయన తెలిపారు.
KRNL: వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, C2+50% గిట్టుబాటు ధరకు చట్టబద్ధత, ఎరువులు,విత్తనాలపై 90% సబ్సిడీ,ఉచిత పంట భీమా అమలు చేయాలని కోరారు.
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: నందవరం మండలం నాగలదిన్నె జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న తెలుగు తోట -వెలుగు బాట పుస్తకావిష్కరణ వినుకొండలో ఘనంగా జరిగింది. హెచ్ఎం బి. శైలజ, ఎంఈవో షేక్ జఫ్రుల్లా, ప్రముఖ వైద్యలు డా. ఎల్. యన్. రావు, జన విజ్ఞాన వేదిక కార్యవర్గం చేతుల మీదగా ఆవిష్కరించారు. కవి గద్వాల సోమన్నను సన్మానించారు.
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18463/64) ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో గంజాయి ఎక్కువగా సేవించే నిర్మానుష్య ప్రాంతాన్ని పట్టణ బ్లూ కోల్ట్ సిబ్బంది సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గంజాయి కట్టడిపై పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. గంజాయి క్రయ విక్రయాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
W.G: ఈ ఏడాది మార్చి 14న నిర్వహించనున్న తొలి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు న్యాయవాదులు విశేష కృషి చేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. సోమవారం నరసాపురం బార్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సివిల్ తగాదాల్లో రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు.
PLD: పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 151 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు