BPT: బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మండపాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.