E.G: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కల్యాణోత్సవ వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు . శుక్రవారం ఉదయం నిర్వహించిన పల్లకి సేవ శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.