• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ చేసిన కలెక్టర్

W.G: ఉండి మండలం మహాదేవ పట్నం హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. పూర్వపు విద్యార్థి,దాత అల్లూరి రామకృష్ణంరాజును ఆమె అభినందించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు, జిల్లా D.E.O. నారాయణ, సమగ్ర శిక్ష A.P.C.శ్యాం సుందర్, H.M. ఎం.జాన్ బాబు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:19 PM IST

ఆటో లైన్ వివాదం పలువురిపై కేసులు

KRNL: ఎమ్మిగనూరు ఆటోలు లైన్లో పెట్టుకునే విషయంలో హనుమాపురానికి చెందిన నవీన్, రామాంజి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణగా మారి పరస్పరం దాడులు, ఆటోల అద్దాల ధ్వంసానికి దారితీసింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 14 మందిపై కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 23, 2026 / 08:18 PM IST

ఇంటర్ పరీక్షలకు 133 మంది హాజరు

TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 138 మందిలో 133 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 08:17 PM IST

ఏసీబీకి సమాచారం ఇచ్చిన వ్యక్తి ఇతనే..!

KDP: సింహాద్రిపురం సీఐ వెంకట రమణ, ఎస్సై అనిల్ కుమార్‌లను లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  ఆయన సమాచారం మేరకు, అధికారులపై మొత్తం రూ.700,000 డిమాండ్ ఆరోపణలు రావడంతో, చివరికి రూ.4 లక్షలకు డీల్ కుదిరినట్లు తెలిపారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:16 PM IST

‘జనగణన శిక్షణకు అధికారుల హాజరు తప్పనిసరి’

NDL: జిల్లాలో జనగణన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నెల 24, 25, 26 తేదీలలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. అయ్యలూరు మెట్టలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి శిక్షణ జరుగుతుందని, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

February 23, 2026 / 08:16 PM IST

‘ఎమ్మెల్యే సహకారంతో సమస్యల పరిష్కరిస్తాం’

నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో మండల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన కొడవలూరు మండలంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. మండల పరిధిలోని పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 23, 2026 / 08:15 PM IST

‘పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి’

PPM: మార్చి 16 నుండి జిల్లాలో జరగబోయే పదవ తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత అధికారులను ఆదేశించారు. సోమవారం పదవ తరగతి ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు.

February 23, 2026 / 08:14 PM IST

సరస్వతి కండ్రిగలో YSRCP గ్రామ కమిటీ ఏర్పాటు

TPT: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో YSR కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డివారి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. వివిధ విభాగాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

February 23, 2026 / 08:12 PM IST

అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

VZM: ఈనెల 23, 24వ తేదీలలో సీడీపీవో కార్యాలయం వద్ద చేపట్టవలసిన దీక్షలపై సోమవారం వియ్యంపేట ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2019 నుంచి జీతాలు పెంచలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 42 రోజులు దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు.

February 23, 2026 / 08:12 PM IST

సైబర్ నేరాలపై అవగాహన

ASR: జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో పెదబయలు ఎస్సై వెంకటేష్ అడుగులపుట్టు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, మహిళల రక్షణతో పాటు గంజాయి, నాటుసారా (ID Arrack) అనర్థాలపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:11 PM IST

‘అగ్రిగోల్డ్ సమస్య కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి’

అగ్రి గోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అగ్రి గోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ ఈ జనవరి నాటికి మూసి 12 ఏళ్ళు పూర్తి అయిందన్నారు. అయినా కానీ ఆ సమస్య అలాగే ఉందన్నారు.

February 23, 2026 / 08:10 PM IST

జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే..!

ఏలూరు: జిల్లాలో 10 పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:10 PM IST

ఉద్యోగులకు అందని వేతనాలు..!

కడప: YVUలోని 140 మంది ఆప్కాస్ ఉద్యోగులు నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు నాలుగు నెలలుగా ప్రభుత్వ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బడ్జెట్ లేదనే కారణంతో ఫైనాన్స్ అధికారులు నిధులను మళ్లిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వైద్య సేవలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి.

February 23, 2026 / 08:04 PM IST

‘వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు కేటాయించాలి’

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పామూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల తాగునీరు, సాగునీరు అవసరాలకు వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్నారు.

February 23, 2026 / 08:04 PM IST

పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:00 PM IST