KRNL: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ.కుమారస్వామి సోమవారం మంత్రాలయాన్ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద అధికారులు, నాయకులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
PLD: సత్తెనపల్లిలోని గ్రంథాలయం ఎదుట ఉన్న రోడ్డు డివైడర్పై సోమవారం రాత్రి ఒక వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు మద్యం మత్తులో ప్రాణాలు విడిచి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: సోషల్ మీడియాలో మహిళా పోలీసును వేధించిన ఏఆర్ కానిస్టేబుల్ గురుమోహన్ రెడ్డిపై అనంతపురం నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కానిస్టేబుల్ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మహిళకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన బాధితురాలి భర్త (పోలీస్ అధికారి) నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ELR: విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులతో పాటు చిల్లర దుకాణాల యజమానులు నిరంతరం గమనిస్తుండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైకిల్ పంచర్ గ్లూ, వైట్నర్, ఫెవికాల్ వంటి వస్తువులను విద్యార్థులు తరచూ కొనుగోలు చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు.
BPT: బల్లికురవ మండలం వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, టోల్ప్లాజా అంబులెన్స్లో క్షతగాత్రుడిని అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్సీపట్నం గురుకుల పాఠశాలలో బాలురు, అచ్యుతాపురంలో బాలికలకు 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
KDP: బలపనూరు 132/33 కేవీ సబ్స్టేషన్లో అత్యవసర పనులు చేయనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహరించాలని ఆయన కోరారు.
KKD: అన్నవరం కొండపై రామాలయం వద్ద సోమవారం 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దేవస్థానం అధికారులు అతడిని 108 వాహనంలో తుని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడని అన్నవరం పోలీసులు తెలిపారు. మృతుని మెడలో జంధ్యం, తువ్వాలు ఉన్నాయి. అతని వివరాలు తెలిసిన 9440796530 నెంబర్ కు తెలియజేయాలన్నారు
చిత్తూరు: పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బసవరాజ బాలికల, బాలుర కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 332 మంది విద్యార్థులకు గాను 318 విద్యార్థులు హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర నాయుడు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మైనారిటీల సంక్షేమంపై ఆయన గళమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలకు కేటాయించిన నిధుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయిలో ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
GNTR: పాతగుంటూరు నందివెలుగు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట అడ్డాపై సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు 11 మంది జూదగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి దగ్గర రూ. 80వేల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
NLR: చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తున్నారని చేపల గుంటలకు కరెంటు సరఫరాను మత్సశాఖ అధికారులు నిలిపివేయించిన ఘటన బుచ్చిలో చోటుచేసుకుంది. కాగులపాడు గ్రామాలలో మత్స్యశాఖ జేడీ కే శాంతి చేపల గుంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. 9 మంది రైతులు కోళ్ల వ్యర్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి డ్రమ్ములు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3, సిట్టింగ్ 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి.
అనకాపల్లి: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించాలన్నారు.