KDP: గ్యాస్ కొరత ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 11,400 కేంద్రాలకు స్టవ్లు అందించగా.. సానుకూల స్పందన రావడంతో మిగిలిన వాటికి ఇవ్వాలని నిర్ణయించింది.