NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆ పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. గురువారం ఆ మైక్ సెట్ను ఇచ్చినట్లు హెచ్ఎం చెంచురామయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దాదాపుగా 61 వేలు విలువైన మైక్ సెట్ను బహుకరించినట్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.