సత్యసాయి: అమరావతి సచివాలయంలో ‘మిషన్ హెల్తీ భారత్’ యాత్ర నిర్వహిస్తున్న యువతి తాప్సీ ఉపాధ్యాయను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సత్కరించారు. మీరట్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ యాత్ర ద్వారా ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 17,400 కిలోమీటర్లు ప్రయాణించి, ఊబకాయంపై అవగాహన కల్పించినట్లు ఆమె వివరించారు.