MHBD: శ్రీరామనవమి వేడుకల సందర్బంగా గంగారం మండలం కోమాట్లగూడెం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులందరూ కలిసి సంప్రదాయబద్ధంగా తలంబ్రాల బియ్యం సిద్ధంచేశారు. పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం.. మహిళలందరూ కలిసి రోకళ్లతో పసుపు దంచి, ఆ పసుపును బియ్యంలో కలిపారు.